మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సినిమాల జొరును పెంచారు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.రామ్చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ తెరకెక్కించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి..మణిశర్మ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం నుంచి ”కల్లోలం కల్లోలం.. ఊరు వాడా కల్లోలం” అనే పాటని విడుదల చేశారు. చిరు, రెజీనాలపై చిత్రీకరించిన ప్రత్యేక గీతమిది.
”సానా కష్టం వచ్చిందే మందాకినీ.. చూసేవాళ్ల కళ్లు కాకులెత్తుకు పోనీ” అంటూ హుషారుగా సాగుతున్న ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యమందించగా.. రేవంత్, గీతామాధురి ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ నృత్యరీతులు సమకూర్చారు. నైట్ ఎఫెక్ట్లో పాటని చిత్రీకరించిన విధానం, బీట్కి తగ్గట్లుగా చిరు వేసిన హుషారైన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేవాదాయ శాఖలోని అవినీతి నేపథ్యం చుట్టు అల్లుకున్న కథతో ఈ చిత్రం రూపొందినట్లు సమాచారం. ఈ సినిమా కోసం ధర్మస్థలి అనే ఓ భారీ ఊరి సెట్ను వేశారు. చిరుకు కాజల్, చరణ్ కు పూజా హెగ్డే లు నటిస్తూన్నారు.